Friday, May 8, 2020

బంగినపల్లి మామిడి

ఫలరాజం.. బంగినపల్లి మామిడి

ఫలాల్లో మామిడిది మహారాజ హోదా. అందులోనూ బంగినపల్లి మామిడి సంగతి చెప్పాల్సిన పని లేదు. బంగినపల్లి అనగానే నోరూరించే మామిడి మాధుర్యం గుర్తుకు వస్తుంది. మధురమైన మామిడి పండ్లకు చిరునామా బనగానపల్లె. బనగానపల్లె నవాబు మీర్‌ గులాం అలీఖాన్‌(1905-1922)కు మామిడి పండ్లంటే మక్కువ. మేలు జాతి బేనిషాన్‌ రకాన్ని ఎంపిక చేసుకుని బనగానపల్లె సంస్థానంలో విరివిగా నాటించారు. అట్లా ఈ రకం పండ్లకు బనగానపల్లె మామిడిగా పేరు వచ్చింది. వ్యవహారంలో బంగినపల్లిగా మారింది. ఇక్కడ నుంచి తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ఈ రకం సాగు విస్తరించింది. విదేశాలకు కూడా బనగానపల్లె ప్రాంతం నుంచి ఎగుమవుతుంటాయి. ఒక్కో పండు రెండు కిలోల వరకు తూగుతుంది. ఏ మాత్రం పీచు లేకుండా పూర్తి గుజ్జు ఉండే రుచికరమైన రకం ఇది. నవాబుల కాలంలో 3 వేల ఎకరాల్లో సాగైన బంగినపల్లి ప్రస్తుతం 500 ఎకరాల్లో దీని ఖ్యాతి ఇంతా అంతా కాదు. పొరుగు రాష్ట్రాలకు, దేశ విదేశాలకు బంగినపల్లి మామిడి పండ్లు సరఫరా అవుతుంటాయి. సామాన్య ప్రజలు కూడా వేసవిలో బంగినపల్లి మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. 

గతంలో మామిడి పండ్లను బాదం గడ్డి, వరి గడ్డితో మాగించేవారు. అందువల్ల మంచి వాసన, రుచి ఉండేది. ప్రస్తుతం వ్యాపారులు పండ్లను కార్బైడ్‌, ఇతర రసాయనాలతో మాగిస్తున్నారు. దీంతో రుచి తగ్గిపోయింది.

బనగానపల్లె నవాబుల కాలంలో 3 వేల ఎకరాల్లో ఈ పంట బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో సాగయ్యేది. క్రమంగా పంట సరిగా రాకపోవడంతో చెట్లను కొట్టేసి వేరే పంటలు పండించడం ప్రారంభించారు. దీంతో యేటేటా బంగినపల్లి మామిడి విస్తీర్ణం తగ్గిపోయింది.

నోరూరించే బంగినపల్లి 
మధురమైన బనగానపల్లె మామిడి పండ్లలో ఆనాటి రుచి మాయమవుతోంది. ఇప్పుడు మామిడి పండ్లు విషతుల్యం అవవుతున్నాయి. త్వరగా పక్వానికి రావడానికి నానారకాల రసాయనాలు, కార్బైడ్‌లను వాడుతున్నారు. ఇలా మాగబెట్టడం వల్ల రుచి కోల్పోతున్నాయి. ఇవి తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


కృత్రిమ పక్వం 
బంగినపల్లి మామిడి పండ్లకు ఉండే గిరాకీని వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి కృత్రిమ పద్ధతిలో పక్వం చేస్తున్నారు. పసువు పచ్చ రంగులో అచ్చం మాగిన పండు లాగా కనిపించేలా చేసి అమ్ముతున్నారు. ఇలా మాగేసిన కాయలు ఏమాత్రం రుచి లేక పోగా విష తుల్యం. 
 
తగ్గిన దిగుబడి 
సాగవుతోంది. దీంతో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వేరే రకం కాయలు దిగుమతి చేసుకుని బంగినపల్లి మామిడి పండ్లని విక్రయిస్తున్నారు.